శ్రీమద్భాగవతంలోని అనేక రసవద్ఘట్టాలలో రుక్మిణీ కల్యాణం ఒకటి.
భక్తితో పాటు ప్రేమ, ఆరాధన, అనుబంధాలు ఇందులో ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. పరమాత్వ తత్వంతో పాటూ, జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని మారుతున్న కాలపరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో ఉంచుకొని సరళమైన పద్య సౌందర్యంతో, సర్వ జనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది తెరకెక్కించే ప్రయత్నం చేశారు శ్రీ రత్నంగారు.
ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.
జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి,దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.
సీ||
సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనువేల
మోహనాకార ! నీ మోవిపై మురళీయై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?
ఆ||
ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !
తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు ఎంతకీ తిరిగిరాకపోయేసరికి 'ఏమైనదో ఏమో' అని రుక్మిణీదేవీ మనస్సు పలువిధాలుగా ఆలోచిస్తూ, చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.
సీ||
ఏల నా స్వామి రాడెమి కథెమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె,వృద్ధు
డాయాసపడి, దుర్గమారణ్య మార్గమున్
గడచెనో,కడచినా ,కడలనధిగ
మించి ద్వారకపురమేగెనో ? ఏగిన
మాధవు దర్శన మతనికాయె
నో లేదో,విని ఏమనుకొనెనో మనమున
దయచేయ తలచునో,తలుపడేమొ
గీ||
కలికి ! శ్రీ గౌరి ఏరీతి కరుణగొనునో
వ్రాలు నా తలనేమని వ్రాయబడెనో
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు
రుక్మిణీ కల్యాణం నాటికపై అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ , శతాధిక నాటకకర్త, నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలను ఇక్కడ జతపరుస్తున్నాం .
భక్తితో పాటు ప్రేమ, ఆరాధన, అనుబంధాలు ఇందులో ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి. పరమాత్వ తత్వంతో పాటూ, జీవిత సత్యం కూడా పొందుపరచబడి ఉన్న ఈ మధుర ఘట్టాన్ని మారుతున్న కాలపరిస్థితులను,రంగస్థల ప్రదర్శనానుకూలతను దృష్టిలో ఉంచుకొని సరళమైన పద్య సౌందర్యంతో, సర్వ జనామోదయోగ్యమైన నాటకంగా తీర్చిదిద్ది తెరకెక్కించే ప్రయత్నం చేశారు శ్రీ రత్నంగారు.
ఈ నాటకంలోని కొన్ని రమ్యమైన పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం.
జగన్నాటక సూత్రధారియైన శ్రీకృష్ణుని ప్రేమకై అపర లక్ష్మీదేవియైన రుక్మిణి తపించి,దుఃఖించే సందర్భంలో వచ్చే సీస పద్యం.
సీ||
సరసిజనాభ ! నీ శౌర్యార్చనార్పిత
ధామమ్ము కాని సౌందర్యమేల ?
పావన చరిత ! నీ ప్రణయానురాగాల
పులకించని పరువంపు తనువేల
మోహనాకార ! నీ మోవిపై మురళీయై
మధుర శ్రుతులిడని మనుగడేల ?
దురితాపహార ! నీదు పదసన్నిధిలోన
ప్రమిదనై వెలుగని భాగ్యమేల ?
ఆ||
ఆశ్రిత జనపాల ! అంచిత గుణశీల !
పుణ్య హృదయలోల ! భువనపాల !
వేణుగానలోల ! వినవేల ! వేయేల !
నీవులేని బ్రతుకు నిలుపఁ జాల !
తన ప్రేమ రాయబారాన్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని కడకు తీసుకువెళ్ళిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు ఎంతకీ తిరిగిరాకపోయేసరికి 'ఏమైనదో ఏమో' అని రుక్మిణీదేవీ మనస్సు పలువిధాలుగా ఆలోచిస్తూ, చింతించే సమయంలో వచ్చే మరొక సీస పద్యం.
సీ||
ఏల నా స్వామి రాడెమి కథెమొ ? భూసు
రేంద్రు డగ్నిద్యోతు డేగె,వృద్ధు
డాయాసపడి, దుర్గమారణ్య మార్గమున్
గడచెనో,కడచినా ,కడలనధిగ
మించి ద్వారకపురమేగెనో ? ఏగిన
మాధవు దర్శన మతనికాయె
నో లేదో,విని ఏమనుకొనెనో మనమున
దయచేయ తలచునో,తలుపడేమొ
గీ||
కలికి ! శ్రీ గౌరి ఏరీతి కరుణగొనునో
వ్రాలు నా తలనేమని వ్రాయబడెనో
తెల్లవారె లగ్నము,వచ్చిరెల్లవారు
ఎట్లు తెల్లవారునో బ్రతుకేమి జేతు
రుక్మిణీ కల్యాణం నాటికపై అవధాన చక్రవర్తి, శతావధాన సార్వభౌమ డాక్టర్ మేడసాని మోహన్ , శతాధిక నాటకకర్త, నాటక నవరత్నం కొడాలి గోపాలరావు వంటి ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలను ఇక్కడ జతపరుస్తున్నాం .
0 comments:
Post a Comment